అనంతలో రూ.1200 కోట్ల వేరుశనగ పంట నష్టం..
Ens Balu
2
కలెక్టరేట్
2020-11-09 19:06:37
అనంతపురం జిల్లాలో అధిక వర్షాల కారణంగా జరిగిన పంట నష్టంపై కేంద్ర బృందం సానుకూలంగా స్పందించిందని కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. సోమవారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో రూ.1200 కోట్ల పంట నష్టం జరిగిందనీ.. ఉద్యాన పంటలు, రోడ్లు మరియు ఇతర నష్టం మరో రూ.150 కోట్లుగా ఉందని కేంద్ర బృందానికి వివరించామన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రమే కేంద్ర బృందం పర్యటించాల్సి ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి జిల్లాలోని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అనంతలోనూ బృందం పర్యటించేలా కృషిచేశారన్నారు. ప్రత్యేక చొరవ తీసుకున్న ముఖ్యమంత్రికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో 4 లక్షల 76 వేల హెక్టార్లలో వేరుశనగ పంట నష్టం వాటిల్లిందన్నారు. మొత్తం ఆధారాలతో కేంద్ర బ్రుందానికి వివరించామని చెప్పిన కలెక్టర్ అధికారులు కూడా రైతుల కష్టాలను, నష్టాలను స్వయంగా తెలుసుకున్నారని వివరించారు.