కేంద్ర బృందంతో మంత్రి మాలగుండ్ల..
Ens Balu
2
Guntakal
2020-11-09 19:09:40
అనంతపురం జిల్లాలో రైతుల పొలాల్లో పంట పరిస్థితిని పరిశీలించి, గుంతకల్లు రైల్వే గెస్ట్ హౌజుకు చేరుకున్న కేంద్ర బృందాన్ని మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ కలిసారు. శివమాలలో కనిపించిన మంత్రి... అధిక వర్షాల వల్ల జిల్లా రైతులు చాలా నష్టపోయారని, నిత్యం కరువు కోరల కింద నలిగిపోతున్న రైతన్నలు ఆదుకోవాలని, పరిహారం అందించడంలో కేంద్రం భోళా శంకరుడిని తలపించాలని కోరారు. మరికొన్ని గ్రామాల్లో తానూ పర్యటించాలని మంత్రి నిర్ణయించుకున్నప్పటికీ... అప్పటికే సమయం మించిపోయినందున కేంద్ర బృందం తిరుగు ప్రయాణం కట్టడంతో కేంద్ర బృందంతో కలిసి పంటలను పరిశీలించలేక పోయారు..అధిక వర్షాల కారణంగా పంట నష్టం అంచనా వేసేందుకు జిల్లాకు వచ్చిన కేంద్ర బృందాన్ని కలిసి ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామి రెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డిలు జిల్లాలో ఈ యేడు జిల్లాలో వచ్చిన పచ్చి కరువును గురించి వివరించారు..