ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా..
Ens Balu
3
Vizianagaram
2020-11-10 20:08:27
విజయనగరం జిల్లాలో రెండు మినరల్ కంపెనీ లకు సంబంధించి పర్యావరణ సంబంధ అనుమతుల కోసం మక్కువ మండలం ఎస్. పెద్ద వలస గ్రామంలో బుధవారం జరగ వలసిన ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడినట్లు కాలుష్య నియంత్రణ మండలి ఈ.ఈ. బి. సుదర్శనం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ పాల్గొనాల్సి వున్న కారణంగా ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడినట్లు పేర్కొన్నారు. తాండ్ర మినరల్స్, తాండ్ర ఎక్స్ పోర్ట్స్ కు సంబంధించిన అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని గతంలో ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. సీఎం కార్యక్రమం పూర్తికాగానే ప్రజాభిప్రాయ సేకరణ ఎపుడు ప్రారంభించేది తెలియజేస్తామని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ కంపెనీలకు ముఖ్యమని ఆయన మీడియాకి వివరించారు.