అమర జవాన్ల త్యాగాలు మరువలేనివి..
Ens Balu
1
Mylavaram
2020-11-10 20:18:36
ముష్కరుల పోరులో వీరమరణం పొందిన జవాన్ల ఆత్మక శాంతి చేకూరాలని కోరుతూ మదర్ థెరీసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు కోయ సుధ సభ్యులు ఘనంగా నిర్వాహించారు. మంగళవారం క్రిష్ణాజిల్లా మైలవరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోయసుధ మాట్లాడుతూ, జమ్ముకాశ్మీర్ పుల్వామా జిల్లా మచిల్ సెక్టార్ లో భారత దేశ భద్రతాదళాలపై ఉగ్రవాదులు అక్రమ చొరబాట్లను ఉక్కుపాదం అణచివేయాలన్నారు. ముష్కరులను తరిమి తరిమికొట్టాలన్నారు. అలాంటి సాయుధపోరులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన అవాలుదారు ప్రవీణ్ కుమార్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్రం కి చెందిన ర్యాడ మహేష్ త్యాగాలను దేశం గుర్తుంచుకుంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై పోరులో ప్రపంచదేశాలు కలిసి రావాలన్నారు. ముష్కరుల దాడిని ప్రతీ ఒక్క భారతీయుడూ ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో మదర్ థెరీసా చారిటబుల్ ట్రస్ట్ సిబ్బంది, సహాయకులు పాల్గొన్నారు.