ఘనంగా మౌలానా అబుల్ కలామ్ జయంతి..
Ens Balu
2
కలెక్టరేట్
2020-11-11 14:46:36
భారత దేశ ప్రథమ విద్యా శాఖ మంత్రి జనాబ్ మౌలానా అబుల్ కలామ్ అజాద్ జయంతి ఉత్సవం బుధ వారం శ్రీకాకుళం కలెక్టరేట్ లో ఘనంగా జరిగింది. జాతీయ విద్యా దినోత్సవం మరియు జాతీయ మైనారిటి దినోత్సవంగా నిర్వహిస్తున్న ఈ జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, జిల్లా కలెక్టర్ జె నివాస్ జనాబ్ మౌలానా అబుల్ కలామ్ అజాద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అబుల్ కలాం ఆజాద్ సేవలను ఉప ముఖ్యమంత్రి కొనియాడారు. అనంతరం రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి జాతీయ విద్యా దినోత్సవం మరియు జాతీయ మైనారిటి దినోత్సవంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఉప ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి మాట్లాడుతూ అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. హాజ్ యాత్రకు రూ.60 వేల వరకు ఆర్ధిక సహాయాన్ని పెంపుదల చేశామన్నారు. అల్ప సంఖ్యాక వర్గాల సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు తెలిసిన ప్రభుత్వ మన్నారు. రాష్ట్రంలోని 9 వందల మదార్శలలో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నామని చెప్పారు. ప్రామాణిక విద్యను అందించుటకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు, ముస్లిం, క్రిస్టియన్ మత ప్రతినిధులు మోహిబుల్లా ఖాన్, ఎం.ఏ. రఫీ, మొహ్మద్ సిరాజుద్దీన్, మొహ్మద్ సలీమా ఖాన్, ఇస్మాయిల్ ఆదర్శి, సిరాజ్ భయ్యా, హాజీ భయ్యా, హాజీ అలీ జాన్, రజా, కృపానందం, జాన్ జీవన్, ప్రేమ్ కుమార్,ఎలీషా తదితరులు పాల్గొన్నారు.