నేతన్న నేస్తం రెండవ విడత విడుదల..
Ens Balu
1
Srikakulam
2020-11-11 17:59:44
వై.యస్.ఆర్ నేతన్న నేస్తం రెండ విడత నిధులు బుధవారం విడుదల అయ్యాయి. 20,06.2020న 2020-21 ఆర్ధిక సంవత్సరానికి మొదటి విడత వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం పథకంను రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి ఆన్ లైన్ ద్వారా జూన్ 20వ తేదీన ప్రారంభించిన సంగతి విదితమే. మొదటి విడతలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మొత్తం 1438 మంది లబ్దిదారులకు ఒక్కొక్కరికి రూ.24,000/- లు చొప్పున మొత్తం రూ.3,45, 12,000/- లు వారి వ్యక్తిగత బ్యాంకు బాతాకు ఆన్ లైన్ ద్వారా నగదు జమ చేశారు. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో రెండవ విడత వై.ఎస్.ఆర్.నేతన్న నేస్తం పథకాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి బుధవారం ఆన్ లైన్ ద్వారా ప్రారంభించి నగదు జమ చేశారు. రెండవ విడతలో శ్రీకాకుళం జిల్లా నుండి మొత్తం 337 మంది లబ్దిదారులకు ఒక్కకరికి రూ.24,000/- లు చొప్పున మొత్తం రూ.80,88,000/- లు వారి వ్యక్తిగత బ్యాంకు' ఖాతాకు ఆన్ లైన్ ద్వారా జమ చేయడం జరిగింది. వెబ్ ఎక్స్ ద్వారా జరిగిన ఆన్ లైన్ కార్యక్రమములో చేనేత, జాళి శాఖ సహాయ సంచాలకులు డా.వి.పద్మ, చేనేత కార్మికులు పాల్గొన్నారు.