అబ్దుల్ కలాం సేవలు చారిత్రాత్మకం..


Ens Balu
2
తిరుపతి
2020-11-11 19:15:30

భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో వీరోచితంగా పోరాటడంతోపాటు, విద్యాభివ్రుద్ధి తొలి బాటలు వేసిన మహనీయులు భారతరత్న అబుల్ కలాం ఆజాద్ అని తిరుపతి అడిషనల్ ఎస్పీ సుప్రజ అన్నారు. బుధవారం అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  స్వాతంత్ర భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రిగా విద్యాభివ్రుద్ధికి ఎంతో క్రుషి చేశారన్నారు. ఆయన జయంతిని మైనార్టీ సంక్షేమ దినంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఆయన ఆశయాలను, సేవలను ప్రతీ భారతీయుడు గుర్తించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమములో యస్.బి డి.యస్.పి గంగయ్య గారు, డి.పి.ఓ ఏ.ఓ కే.వనజాక్షి గారు, డి.సి.ఆర్.బి సి.ఐ హేమసుందర్ నాయుడు, ఆర్.ఐ లు, ఆర్.యస్.ఐ లు, మరియు డి.పి.ఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.