మైనార్టీలకు అండగా ప్రభుత్వం..
Ens Balu
2
Srikakulam
2020-11-11 21:06:15
మైనారిటీలకు అండగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో ఉప ముఖ్యమంత్రి పాత్రకేయులతో మాట్లాడుతూ, మౌలానా అబుల్ కలామ్ కు ముఖ్యమంత్రి ఘన నివాళులు అర్పించారని తెలిపారు. భారత రత్న మౌలానా అబుల్ కలామ్ ప్రధమ భారత విద్యా శాఖామాత్యులు, ఆదర్శనంతమైన రాజకీయ నాయకులు. అని, అటునవంటి మహనీయుని జన్మదినాన్ని మైనారిటీల సంక్షేమ దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషదాయకమని అన్నారు. ముస్లిమ్ లు మరియు ఇతర మైనారిటీలకు దశల వారీగా సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి అమలు చేయడం జరుగుతున్నదన్నదన్నారు. నలుగురు శాసన సభ్యులు ముగ్గురు శాసన మండలి సభ్యులు, ఇందులో ఒక మహిళ కూడా వున్నారని తెలిపారు. అంజాద్ భాషా ఉప ముఖ్యమంత్రి మరియు మైనారిటీ సంక్షేమ శాఖామాత్యులుగా వున్నారని తెలిపారు. మైనారిటీలు ఇతర కమ్యూనిటీల సంక్షేమానికి సైతం ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో జిల్లా కలెక్టర్, జే.సి ఇతర అధికారులంతా కార్యక్రమంలో పాల్గొని మౌలానా అబుల్ కలాంకు నివాళులర్పించారని తెలిపారు. మైనారిటీల అవసరాలను తెలుసుకుని, ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళడం జరుగుతుందని చెప్పారు. మైనారిటీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతున్నదని తెలిపారు. ఇమాములు, మౌజన్లకు గౌరన వేతనం, కరోనా నేపధ్యంలో లాక్ డౌన్ సమయంలో పాస్టర్లు, ఇమామ్ లు, మౌజాన్లకు ఆర్ధిక సాయం అంద చేయడం జరిగిందని తెలిపారు.