కె.రాధికకు జెఎన్టీయూ పీహెచ్డీ..


Ens Balu
2
కాకినాడ జెఎన్టీయూ
2020-11-12 13:15:41

జవహర్ లాల్ నెహ్రూ సాంకేతి విశ్వవిద్యాలయం కె.రాధికకు బుధవారం కాకినాడలో  పీహెచ్డీ డిగ్రీ ప్రధానం చేసింది. ఈ మేరకు ‘‘క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ ‌మల్టీస్పెక్ట్రల్‌ ‌శాటిలైట్‌ ఇమేజస్‌ ‌యూజింగ్‌ ఎన్‌సెంబల్‌ ‌సబ్‌స్పేస్‌ ‌డిసిక్రిమినెంట్‌ ‌టెక్నిక్‌ ‌ఫర్‌ ‌ఛేంజ్‌ ‌డిటెక్షన్‌ అప్లికేషన్స్’’ ‌జెఎన్‌టియుకె అధికారులచే ఆమోద ముద్ర పొందినది. ఈమెనకు పిహెచ్‌డి ‘డాక్టర్‌ ఆఫ్‌ ‌ఫిలాసఫీ’ అవార్డు ఎలక్ట్రానిక్స్ అం‌డ్‌ ‌కమ్యూనికేషన్‌ ఇం‌జనీరింగ్‌ ‌విభాగంలో లభించింది. కె.రాధిక తన సిద్ధాంత వ్యాసాన్ని చిత్తూరు జిల్లా తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలోని ఎస్‌వియు కాలేజ్‌ ఆఫ్‌ ఇం‌జనీరింగ్‌ ఈసిఈ విభాగం అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌డా.ఎస్‌.‌వరదరాజన్‌ ‌గారి ఆధ్వర్య పర్యవేక్షణలో సమర్పించారు. రాధికకు పీహెచ్డీ అవార్డు లభించడం పట్ల, సహచర అద్యాపకులు, ఇతరులు హర్షం ప్రకటించారు. మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు..