14న బాలల దినోత్సవం..
Ens Balu
4
Srikakulam
2020-11-12 21:25:53
శ్రీకాకుళంలో ఈ నెల 14వ తేదీన వై.ఎస్.ఆర్.కళ్యాణ ఫంక్షన్ హాల్ లో బాలల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బెజ్జిపురం యూత్ క్లబ్ డైరక్టర్ ఎం.ప్రసాదరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధమ భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా యూత్ క్లబ్ ఆఫ్ బెజ్జిపురం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, జిల్లా పోలీసు సూపరెంటెండెంట్ అమిత్ బర్దార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అడిషనల్ ఎస్.పి. పి.సోమశేఖర్ అధ్యక్షతన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. గౌరవ అతిధిగా ఎల్.రమేష్ జిల్లా పౌర సంబంధాల అధికారి హాజరుకానున్నారని తెలిపారు. ఆపరేషన్ మస్కాన్ ద్వారా గుర్తించిన ఏభై మంది పిల్లలకు కేష్ అవార్డ్, నిత్యావసర కిట్లు అందించడం ని, కార్యక్రమం ఉదయం 11 గం.లకు ప్రారంభం కానున్నదని తెలిపారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారులు, ఐసిడిఎస్.అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారని సదరు ప్రకటనలో తెలిపారు.