కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం..
Ens Balu
1
Renigunta
2020-11-13 17:09:27
చిత్తూరు జిల్లాలో రెండురోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. తిరుపతి అర్బన్ ఎస్.పి.రమేష్ రెడ్డి, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్, రేణిగుంట తహసీల్దార్ శివప్రసాద్, ఎయిర్ పోర్ట్ డిప్యూటీ కమాండెంట్ శుక్లా, బిజెపి నాయకులు భానుప్రకాష్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, కోలా ఆనంద్, సామంచి శ్రీనివాస్, సైకం జయచంద్రారెడ్డి, జల్లి మధుసూదన్, అజయ్ కుమార్, కాసరం రమేష్, రేణిగుంట డీఎస్పీ చంద్రశేఖర్, టర్మీనల్ మేనేజర్ లు గోపాల్, శ్యామ్, సి ఐ ఎస్ ఎఫ్ అధికారి భాస్కరరావు, ఆర్.ఐ.జీవన్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రెండు రోజులు తన కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం తిరిగి హైదరాబాదుకి తిరుగు ప్రయాణం అవుతారని అధికార వర్గాలు తెలియజేశాయి..