20 లోగా NTSE కి విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవాలి..
Ens Balu
2
Srikakulam
2020-11-13 19:29:47
శ్రీకాకుళం జిల్లాలో డిసెంబర్ 13న జరగనున్న జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష ( NTSE ) కొరకు 10వ తరగతి విద్యార్ధులు ఈ నెల 20లోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అన్ని గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్ధులే కాకుండా 18 సం.ల లోపు వయస్సు కలిగి దూరవిద్య ద్వారా మొదటిసారి 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధులు కూడా ఈ పరీక్షకు అర్హులేనని ఆమె చెప్పారు. పూర్తి వివరాల కొరకు www.bseap.org వెబ్ సైట్ నందు లేదా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని ఆమె ఆ ప్రకటనలో వివరించారు. ఈ అవకాశాన్ని ఆశక్తి వున్న విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇలాంటి పరీక్షలు రాయడం ద్వారా రాబోయే రోజుల్లో పోటీపరీక్షలకు ప్రేరణగా వుంటుందని ఆమె వివరించారు.