అర్చకులు, పోటు కార్మికులకు వస్త్రాలు విరాళం
Ens Balu
4
Tirumala
2020-11-14 13:40:18
టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు వెమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, పార్లమెంటు సభ్యులు వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి వస్త్రాలను శనివారం విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకులు, వేద పారాయణదారులు, పోటు కార్మికులు కలిపి మొత్తం 1200 మందికి ఈ వస్త్రాలను అందజేశారు. దీపావళి పర్వదినం రోజున తిరుమలలోని అర్చక నిలయంలో ఈ కార్యక్రమం జరిగింది. అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.