సంతకం ఫోర్జరీ..డిజిటల్ అసిస్టెంట్ సస్పెన్షన్..
Ens Balu
2
Srikakulam
2020-11-16 20:30:11
శ్రీకాకుళం జిల్లాలో సోంపేట మండలం మామిడిపల్లి గ్రామ సచివాలయ గ్రేడ్ 4 డిజిటల్ అసిస్టెంట్ బి.సతీష్ కుమార్ ను సస్పెన్షన్ చేస్తూ వార్డు, గ్రామ సచివాలయ విభాగం జేసీ డా.కె.శ్రీనివాసులు సోమ వారం ఉత్తర్వులు జారీ చేసారు. ఇసుక తరలింపుకు సంబంధించిన వే బిల్లు ఎస్ 3 ఫారంను పంచాయతీ కార్యదర్శి మరియు డ్రాయింగ్ అధికారి అనుమతి లేకుండా జారీ చేయడమే కాకుండా, సంతకం ఫోర్జరీ చేసినట్లు విచారణలో వెల్లడైందని చెప్పారు. లబ్దిదారుల నుండి ఎస్ 3 ఫారం జారీ చేయుటకు కొంత సొమ్ము వసూలు చేసినట్లు నిర్ధారణ జరగింది. ఈ మేరకు క్రమశిక్షణా చర్యలలో భాగంగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.