సునీతకు గణితంలో జెఎన్టీయూ పీహెచ్డీ..
Ens Balu
2
Kakinada
2020-11-18 16:15:10
జవహర్ లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్శిటీ కాకినాడ ఎస్.సునీతా దేవికి మ్యాథమెటిక్స్ విభాగంలో పీహెచ్డీ ప్రధానం చేసింది. ‘‘ఏ స్టడీ ఆన్ ఏ క్లాస్ ఆఫ్ ఆల్మోస్ట్ పారాకాంటాక్ట్ మెట్రిక్ మానిఫోల్డస్’’ జెఎన్టియుకె అధికారులచే ఆమోద ముద్ర పొందినది. ఎస్.సునీతా దేవి తన సిద్ధాంత వ్యాసాన్ని కాకినాడలోని జెఎన్టియుకె యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ (యుసిఇకె) మ్యాథమెటిక్స్ విభాగాధిపతి డా.జి.వి.ఎస్.ఆర్.దీక్షితులు, విశాఖపట్నంలోని జి.వి.పి. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ మ్యాథమెటిక్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా.కె.ఎల్.సాయి ప్రసాద్ ఆధ్వర్య పర్యవేక్షణలో సమర్పించారు. సునీతా దేవికి పీహెచ్డీ లభించడం పట్ల సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు.