30 లోగాwjhs ప్రీమియం చెల్లించాలి..


Ens Balu
3
Srikakulam
2020-11-18 16:32:08

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2020-21 ఆర్ధిక సంవత్సరానికి పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం  జీవో యం.యస్ నెం. 122, తేది: 01.10.2020న ఉత్తర్వులు జారీ చేసింది.  రాష్ట్ర వ్యాప్తంగా అక్రిడిటేషన్లు కలిగి (1 అక్టోబరు నెల నుంచి డిసెంబర్ 31 2020) వరకు రెన్యూవల్ చేయించుకున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఈ పథకం క్రింద నవంబరు 30వ తేది లోపు ప్రీమియం మొత్తం రూ. 1250/- చెల్లించాలి. www.cfms.ap.gov.in వెబ్ సైట్ ద్వారా క్రింద తెలిపిన పద్దుకు ప్రీమియం మొత్తాన్ని చెల్లించాలి.  ప్రస్తుతం రెన్యువల్ చేసుకున్న వారు, కొత్తగా చెల్లించిన వారికి 2021 మార్చి 31 వరకు పథకం వర్తిస్తుంది. ఈ పద్దు ద్వారా Head of Account: 8342-00-120-01-03-001-001,DDO Code: 2703-0802-003 ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజనల్ చలానా, రెన్యూవల్ చేసుకున్న అక్రిడిటేషన్ జిరాక్సు కాపీలను జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో సమర్పించాల్సి వుంటుందని డిడి తెలియజేశారు..