స్వామీజీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి..


Ens Balu
2
Vishaka Sri Sharada Peetham
2020-11-18 19:28:03

విశాఖలోని చినముషిడివాడలోని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని రాష్ట్ర పర్యాటశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణలు పేర్కొన్నారు. బుధవారం స్వామీజీ జన్మదినోత్సవం సందర్భంగా మంత్రి, ఎంపీలు పెందుర్తి శారధా పీఠం ప్రాంగణంలోని శారదా స్వరూప రాజశ్యామలా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామీజిని కలిసి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా మంత్రి స్వరూపానంద్రేంద్ర సరస్వతికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి అవంతి మాట్లాడుతూ, స్వామీజీ వలన ఈ ప్రాంతానికే  ఆధ్యాత్మిక శోభ నిత్యం కలుగుతుందన్నారు. ఆయన తరువాత ఆయన కుమారులు సాత్వానంత సరస్వతి కూడా ఈ ప్రాంతానికి వరంగా ఇక్కడే ఉండటం అభినందనీయమన్నారు. స్వామీజి విజయనగరం ఎంపీ బి. చంద్రశేఖర్ గారు, విశాఖ రురల్ జిల్లా అధ్యక్షులు చిన్నప్పల నాయుడు, ఆడిటర్ జివి ఇతర నాయకులు పాల్గొన్నారు.