జివిఎంసీ పన్నులు శతశాతం వసూలు చేయాలి..


Ens Balu
2
జివిఎంసీ ప్రధాన కార్యాలయం
2020-11-18 19:34:54

జివిఎంసికి చెల్లించవలసిన పన్నులు శతశాతం వసూలు చేయాలని జివిఎంసి కమిషనర్ అదనపు కమిషనర్ ఎ.జ్యోతి అధికారులను ఆదేశించారు. బుదవారం, జివియం సి సమావేశమందిరంలో జోనల్ కమిషనర్లు, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్ స్పెక్టర్లతో సమావేశం నిర్వహించారు. 2020 - 21 ఆర్ధిక సంవత్సరమునకు సంబందించి ఆస్తి, ఖాళీ స్థలాల పన్ను, నీటి చార్జీలు, కళ్యాణమండపాలు, షాపులు, మార్కెట్ల నుండి రావలసిన లీజు బకాయిలు పూర్తిగా వసూలు చేయాలని ఆదేశించారు. అదాయం సకాలంలో వసూలు చేయకపోతే ప్రజలకు అందించవలసిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులకు ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయన్నారు. పన్ను వసూళ్ళలో వెనుకబడ్డ రెవెన్యూ ఆఫీసర్లను, రెవెన్యూ ఇన్స్ స్పెక్టర్లును తీవ్రంగా హెచ్చరించారు.  నూతనంగా కట్టిన భవనాలకు, వినియోగ మార్పిడి జరిగిన భవనాలు, పన్ను పరిధిలోకి రాని ఖాళీ స్థలాలను, అసంపూర్ణంగా కట్టి వదిలేసిన అపార్ట్మెంట్లను గుర్తించి, వెంటనే పన్నులు విధించాలని ఆదేశించారు. ఒకే డోర్ నెంబర్లతో రెండు అసెస్మెంట్లు కొన్ని చోట్ల ఉన్నాయని  అటువంటి వాటిని వార్డు ఎమినిటీ కార్యదర్శుల సాయంతో గుర్తించి డోర్ నెంబరు మార్పులు చేర్పులు చేయాలన్నారు. కొత్తగా కట్టిన భవనములు, ఇళ్ళు, దుకాణములు వార్డు ఎమినిటీ కార్యదర్శుల సాయంతో గుర్తించి వాటికి పన్నులు వేయాలన్నారు. ఆస్తి పన్నులతో పాటే నీటి చార్జీలు డిమాండ్ నోటీసులు పంపి నీటి రుసుములు కూడా వసూలు చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో  జోనల్  కమిషనర్లు,  డి.సి.(రెవెన్యూ) ఎ. రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.