లలితకుమారికి జెఎన్టీయూకె పీహెచ్డీ..


Ens Balu
3
Kakinada
2020-11-19 16:19:19

జవహర్ లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్శిటీ కాకినాడ పి.లలిత కుమారికి పీహెచ్డీ డిగ్రీ ప్రధానం చేసింది. ‘‘నోవల్‌ అ‌ప్రోచస్‌ ‌ఫర్‌ ‌ఫీచర్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ అం‌డ్‌ ‌ప్యాటర్న్ ‌డిస్కవరీ మోడల్‌’’ ‌జెఎన్‌టియుకె అధికారులచే ఆమోద ముద్ర పొందినది. ఈమె తన సిద్ధాంత వ్యాసాన్ని కాకినాడలోని జెఎన్‌టియుకె యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ ‌డా.సిహెచ్‌.‌సత్యనారాయణ గారి ఆధ్వర్య పర్యవేక్షణలో సమర్పించారు. పరిశీలకుల బృందం సిఫార్సు మేరకు పి.లలిత కుమారి  సిద్ధాంత వ్యాసాన్ని పిహెచ్‌డి సిఫారసు చేయడంతో ఆమెకు  ‘డాక్టర్‌ ఆఫ్‌ ‌ఫిలాసఫీ’ అవార్డు ని కంప్యూటర్‌ ‌సైన్స్ & ఇం‌జనీరింగ్‌ ‌విభాగంలో అందించారు. ఈమెకు పీహెచ్డీ రావడం పట్ల సహచరులు హర్షం వ్యక్తం చేశారు.