డిపార్టమెంటల్ టెస్టులు పక్కాగా నిర్వహించాలి..
Ens Balu
2
Srikakulam
2020-11-20 21:08:19
శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి నిర్వహించే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ డిపార్ట్ మెంటల్ టెస్టులకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. డిపార్ట్ మెంటల్ టెస్టుల నిర్వహణపై జిల్లా రెవిన్యూ అధికారి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని శుక్రవారం ఆయన ఛాంబరులో నిర్వహించారు. నవంబర్ 21 నుండి 29 వరకు జిల్లాలో జరగనున్న ఈ పరీక్షలు ( 27వ తేదీ మినహా ) ఉదయం 10.00గం.ల నుండి మధ్యాహ్నం 12.00గం.ల వరకు అలాగే మధ్యాహ్నం 03.00గం.ల నుండి సాయంత్రం 05.00గం.ల వరకు రెండు సెషన్లలో జరుగుతాయని తెలిపారు. రాజాంలోని జి.యం.ఆర్, టెక్కలిలోని ఐతమ్, ఎచ్చెర్లలోని శ్రీశివానీ, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈ పరీక్షల నిర్వహణకు సంయుక్త కలెక్టర్, జిల్లా రెవిన్యూ అధికారి సమన్వయ అధికారులుగా, తహశీల్ధారు, ఉపతహశీల్ధారులు లైజన్ అధికారులుగా ఉంటారని చెప్పారు. కోవిడ్ దృష్ట్యా ప్రతీ కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లుచేయడం జరిగిందని, ప్రతీ కేంద్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డి.ఆర్.ఓ స్పష్టం చేసారు. పరీక్షలు సజావుగా నిర్వహించాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అసోసియేట్ సెక్రటరీ బి.సిహెచ్.ఎన్.కుమార్ రాజు, సెక్షన్ అధికారి డి.నాగభూషణం, ఉపతహశీల్ధారు సతీష్, కలెక్టర్ కార్యాలయంలోని వివిధ విభాగాల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.