కరోనా నియంత్రించమని స్వామిని కోరాను..


Ens Balu
3
Simhachalam
2020-11-21 15:51:04

విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది  శాఖ మంత్రి శనివారం ముత్తంశెట్టి శ్రీనివాసరావు  దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం చేసుకొన్న మంత్రి వర్యులకు ప్రేత్యేక పూజలు నిర్వహించి..తీర్థ ప్రసాదాల స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, త్వరలోనే పంచ గ్రామాల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఇప్పటికే కమిటీలు కూడా వేసినట్టు వివరించారు. కరోరా సెకెండ్ వేవ్ ప్రారంభం అయినందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. స్వామిని కరోనా వైరస్ పూర్తిగా తగ్గించి ప్రజలు సాధారణ జీవితం గడిపేలా చూడమని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని  కోరినట్టు మంత్రి తెలియజేశారు. మంత్రి వెంట స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.