శిష్టకరణ అభివ్రుద్ధికి నిర్విరామ క్రుషి..


Naveen Prasad
2
విశాఖపట్నం
2020-11-23 08:56:01

శిష్టకరణ సామాజిక వర్గం అభివ్రుద్ధికి తమవంతు సహకారం అందించాలని ఇంటక్ జాతీయ నాయకులు మంత్రి రాజశేఖర్ కోరారు. సోమవారం శిష్టకరణ వెల్ఫేర్ అండ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మపర్శన్ కంటి మహంతి అనూషా పట్నాయక్ నుఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, శిష్టకరణాల్లో చాలా మంది నిరుపేదలు ఉన్నారని వారి అభ్యున్నతికి కార్పోరేషన్ ద్వారా సేవలు అందించాలన్నారు. అదే సమయంలో ప్రభుత్వం నుంచి ఉపాది, ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు కూడా క్రుషి చేయాలని కోరారు. చైర్ పర్శన్ మాట్లాడుతూ,ప్రభుత్వం, సామాజికవర్గం తనపై ఉంచిన బాధ్యతను నెరవేర్చడంతో తనవంతు బాధ్యతగా పనిచేస్తానని అన్నారు. చాలా సంవత్సరాల తరువాత శిష్టకరణాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే కార్పోరేషన్ ఏర్పడిందన్నారు. దీని ద్వారా సామాజిక అభివ్రుద్ధి, గుర్తింపు వస్తాయని అన్నారు. కార్యక్రమంలో శిష్టకరణ సంఘం సభ్యులు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.