పరమశివుని ఆలయ ప్రాకారానికి సహకరించండి..
Ens Balu
3
Annavaram
2020-11-23 09:35:07
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం బిసికాలనీలోని వెలసిన శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మితమైన పరమశివుని విగ్రహ ప్రాకారానికి భక్తులు దాతలు సహకరించాలని ధర్మకర్త గంగరాజు కోరుతున్నారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, భక్తుల సహకరాంతోనే స్వామివారి విగ్రహం ఏర్పాటు చేసినట్టు చెప్పిన ఆలయ ప్రాకారం, ఆలయం వద్ద షెడ్లు ఇతర అభివ్రుద్ధి పనులకు దాతలు సహకరించాలన్నారు. ముఖ్యంగా మంచినీటి పైపులైన్లు, భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి షెడ్లు, ఎవరైనా భక్తులు ఇక్కడ అమ్మవారి ఆలయంలో ప్రాంగణంలో పండుగలు చేసుకోవడానికి షామియానా సామాగ్రి, గోడల సిమ్మెంటు పనులు, పరమశివుని విగ్రహం చుట్టూ విద్యుత్ లైంటింగ్, మంచినీటి పైపులు, మంచినీటి బోరుకి మోటారు, వైరింగ్ పనులు మిగిలి వున్నాయని చెప్పారు. భక్తులు నేరుగా కానీ, 9492509024 నెంబరుకి నేరుగా ఫోన్ పే ద్వారా కూడా విరాళాలు పంపించవచ్చునన్నారు. దాతల పేరుతోనే అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆయన వివరించారు. అదే విధంగా కొత్తగా నిర్మించిన పరమశివుని దర్శించుకోవాలని కూడా ధర్మకర్త కోరుతున్నారు. విగ్రహం ప్రారంభమైన మూడు రోజుల్లోనే 5వేల మంది భక్తులు ఇప్పటి వరకూ సందర్శించుకున్నట్టు ఆయన చెప్పారు.