28న జిల్లా సమీక్షా కమిటి సమావేశం..


Ens Balu
2
Srikakulam
2020-11-23 17:27:32

శ్రీకాకుళం జిల్లా సమీక్షా కమిటి (డి.ఆర్.సి) సమావేశం ఈ నెల 28వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. 28వ తేదీ ఉదయం 10.30 గంటల నుండి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో డి.ఆర్.సి ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వర రావు (నాని) అధ్యక్షతన సమావేశం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని ఆయన ఆదేశించారు.