అన్నవరంలో పరమశివుడికి కార్తీక దీపోత్సవం..
Ens Balu
3
Annavaram
2020-11-23 19:05:57
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం బిసికాలనీలో వెలసిన పరమశివుడికి భక్తులు కార్తీక సోమవారం సందర్భంగా రాత్రి దీపోత్సవం నిర్వహించారు. స్వామివారి విగ్రహం వద్ద దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉదయం పూజలు చేసి ఉపవాసం ఉన్న భక్తులంతా సాయంత్రం ఐదుగంటల నుంచే శివయ్యకు కార్తీక దీపం వెలిగించి చుక్కను చూశారు. భక్తుల పూజలకు అనుగుణంగా ఆలయధర్మకర్త స్వామివారి విగ్రహం వద్ద ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటుచేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూజలు నిర్వహించుకోవడినికి వీలుపడింది. అక్కడే బిల్వదళాల చెట్టు, ఉసిరిక చెట్లు వద్ద పూజలు చేసుకోవడానికి వీలుపడింది. ఈ సందర్భంగా కార్తీక దీపాలంకరణకు వచ్చిన భక్తులకు తీర్ధ ప్రసాదాలను ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు.