తిరుపతిలో కాన్వాయ్ రిహార్సల్..


Ens Balu
3
Tirumala
2020-11-23 19:58:40

తిరుపతిలో భారత రాష్ట్రపతిలో రేపు రామ్ నాథ్ కోవింద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ గవర్నర్ బిస్వాభూసన్ హరిచందన్,  సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి పర్యటన సందర్భంగా తిరుపతి అర్భన్ పోలీసులు తిరుపతి పట్టణాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా ఇంటలిజెన్స్ ఐ.జి  శశిధర్ రెడ్డి, డి.ఐ.జి  క్రాంతి రానా టాటా, తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి ఏ.రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో కాన్వయ్ ట్రైల్ నిర్వహించారు. భద్రతా చర్యల్లో భాగంగా రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుచానూరు, తిరుమల (రేణిగుంట విమానాశ్రయం, 150 బైపాస్, తిరుచానూరు అమ్మవారి ఆలయం, బాలాజీ కాలనీ, తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్, శ్రీవారి ఆలయం) వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతోపాటు అప్ ఘాట్ మరియు డౌన్ ఘాట్ రోడ్ల యందు కూడా స్పెషల్ పోలీస్ టీం లచే క్షుణ్ణంగా తనికీలు నిర్వహించి, కాన్వాయ్ రిహార్సల్ ట్రయల్ రన్ ను భధ్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రముఖులు పర్యటన రోజు ఆ సమయంలో ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  చూస్తున్నామని ఎస్పీ వివరించారు.