విశాఖలో సత్యసాయి 95వ జయంతి వేడుకలు..
Ens Balu
4
Visakhapatnam
2020-11-23 21:16:35
విశ్వాభివ్రుద్ధికోసం, ఇతరులకు నిశ్వార్ధ సేవలిందించేందుకు పరితపించిన దైవదూత భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు. సోమవారం విశాఖలో వివేకానంద వ్రుద్ధాశ్రమంలో జహీర్ అహ్మద్ లు సత్యసాయి 95వ జయంతి సందర్బంగా నిరుపేదలకు సాయిడివోటీస్ తో కలిసి బట్టలు, నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎప్పుడూ భక్తిభావాన్ని ప్రజలకు పంచి, దైవత్వాన్ని బోధించిన దేవదేవుడు సత్యసాయి మాత్రమేనన్నారు. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవలు యుగాంతం వరకూ ప్రతీ ఒక్కరికీ గుర్తుంటాయన్నారు. అనంతరం సత్యసాయి భక్తులతో కలిసి భజనా కార్యక్రమంలో పాల్గొని తీర్ధప్రసాదాలుు స్వీకరించారు. ఈ కార్యక్రమంలోని విశాఖ సత్యసాయి డివోటీస్ పాల్గొన్నారు.