అక్రమవసూళ్లకు పాల్పడే 9మంది విలేకరులు అరెస్టు..
Ens Balu
1
Nandigama
2020-11-24 14:40:44
అర్ధరాత్రి సమయంలో వాహనాలను అడ్డుకుని బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న9 మంది విలేకరులపై కృష్ణా జిల్లా వీరులపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. నందిగామ డీఎస్పీ నాగి రెడ్డి ఈ మంగళవారం ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ,కొందరు విలేకరులు ఇటువంటి తప్పుడు దారిని ఎంచుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని అల్లూరు గ్రామంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు విలేకరులను నరసింహారావు పాలెం వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా మిగిలిన ఏడుగురు విలేకర్ల అక్రమ వసూళ్లు బయటపడ్డాయని వారిలో ఆరుగురు విలేకరులను నందిగామలోని కె వి ఆర్ కాలేజీ వద్ద అదుపులోకి తీసుకున్నామని, నందిగామ ఆంధ్రప్రభ విలేకరి నరసింహారెడ్డి పరారీలో ఉన్నాడని పట్టుబడిన ఎనిమిదిమంది విలేకరులను కోర్టుకు హాజరు పరచనున్నట్లు డిఎస్పి నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. కాగా జగ్గయ్యపేట 6 టీవీ ఛానల్ కు చెందిన విలేఖరి కొండ్రు సందీప్ మరియు 19 యూట్యూబ్ ఛానల్ కు చెందిన శ్రీనివాస్, విట్నెస్ యూట్యూబ్ ఛానల్ కు చెందిన వంశీకృష్ణ అనే వ్యక్తులు గత ఆదివారం రాత్రి సమయంలో వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో రహదారిపై వెళ్తున్న లారీని ఆపి తమ దగ్గర ఉన్న కత్తిని చూపించి డబ్బులు డిమాండ్ చేసిన నేపథ్యంలో లారీ వెనుక మరో లారీలో వస్తున్న ముఠా కార్మికులు లారీ డ్రైవర్ తో కలసి 6టివి రిపోర్టర్ సందీప్ ని చితకబాది మొత్తం ముగ్గురు వ్యక్తులను వీరులపాడు పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. లారీ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేయగా ఈ దర్యాప్తు లో భాగంగా వీరితో కలిసి గతంలో ఇదే విధమైన అక్రమ వసూళ్లకు పాల్పడిన నందిగామ ఆంధ్రప్రభ విలేకరి నరసింహ రెడ్డి, కోస్తా ఆంధ్ర విలేకరి తిరుపతిరావు ,H6 యూట్యూబ్ ఛానల్ విలేఖరి ఉప్పు తల వీరబాబు, జీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ విలేఖరి కొంగర నవీన్ ,వి ఎస్ బి యూట్యూబ్ ఛానల్ విలేఖరి ఆవుల గోపికృష్ణ, తో పాటు చిన్నా అనే మరొక యూట్యూబ్ ఛానల్ విలేఖరిని అదుపులోకి తీసుకున్నారు. మీరు తొమ్మిది మందిపై వీరులపడు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సమాచారం.