మీ ఇంటినైతే ఇలానే ఉంచుకుంటారా..
Ens Balu
2
పోలిపల్లి
2020-11-24 17:35:46
మీ ఇంటినైతా ఇంత పిచ్చితుప్పల మధ్య ఇలానే ఉంచుకుంటారా.. మనం పనిచేసే ప్రభుత్వ కార్యాలయాలు దేవాలయాలు లాంటివని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని పోలిపల్లి సచివాలయం సిబ్బందిని హెచ్చరించారు. సచివాలయం వద్ద ఉన్న విశాలమైన స్థలంలో పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉండడం పట్ల సెక్రటరీ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. సచివాలయ సిబ్బంది, అంగన్వాడి, ఆశా, వాలంటీర్లను పిలిచి అప్పటికప్పుడే శ్రమదానం చేసి పిచ్చి మొక్కల్ని తొలగించారు. కలెక్టర్ స్వయంగా మొక్కలు తీయడం తో సిబ్బంది అందరు సైన్యం లా పాల్గొని 10 నిమిషాల్లో ప్రాంగణమంతా పరిశుభ్రం చేసారు. కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి ఉపయోగ పడే మొక్కల్ని పెంచాలని, ఇంకోసారి వచ్చేటప్పటికి మొత్తం పచ్చదనం ఉండాలని కార్యదర్శి కి సూచించారు. సచివాలయాల వద్ద పరిశుభ్రంగా ఉంచక పోతే చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎం.పి.డి.ఓ బంగారయ్య, తహసిల్దార్ రాజేశ్వర రావు, ఉప తహసిల్దార్ గాంధీ, కార్యదర్శి త్రినాధ రావు, మండల వ్యవసాయా ధికారి, మండల ఇంజినీర్, వాలంటీర్ లు పాల్గొన్నారు.