26న రాజ్యాంగ దినోత్సవం..


Ens Balu
3
Srikakulam
2020-11-24 19:08:41

శ్రీకాకుళం జిల్లాలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఈ నెల 26వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. 1949 నవంబరు 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభలో ఆమోదించిన రోజును పురష్కరించుకుని దీనిని నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 26వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించడం జరుగుతుందని, అన్ని కార్యాలయాల్లోనూ దీనిని ఆచరించాలని ఆయన ఆ ప్రకటనలో ఆదేశించారు. రాజ్యాంగ దినోత్సవం పట్ల ప్రతీ ఉద్యోగి, ప్రతీశాఖ సిబ్బంది పూర్తి అవగాహన కల్పించుకోవాలన్నారు. రాజ్యాంగం ద్వారా సిద్ధించిన హక్కులను కూడా తెలుసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.