పేర్ని కుటుంబాన్ని పరామర్శించిన పరీక్షిత్ రాజు..
Ens Balu
2
Machilipatnam
2020-11-25 19:24:35
వైఎస్సార్సీపీ అరకు పార్లమెంటు అధ్యక్షులు, డిప్యూటీసీఎం పాముల పుష్పశ్రీవాణి భర్త శత్రుచర్ల పరీక్షిత్ రాజు బుధవారం ఆంధ్రప్రదేశ్ సమాచారశాఖ మంత్రి పేర్నినాని కుటుంబాన్ని పరామర్శించారు. బుధవారం ఈ మేరకు క్రిష్ణాజిల్లాలోని పేర్ని ఇంటికి వెళ్లి ఇటీవల మ్రుతిచెందిన పేర్ని తల్లిగారైన పేర్ని నాగేశ్వరమ్మ కి ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని తమ కుటుంబం తరుపున కోరారు. ఈ సందర్భంగా మంత్రి నానితో మాట్లాడుతూ, తల్లిని కోల్పోవడమంటే చాలా వారకూ ఇంటి పెద్దను కోల్పోవడమేనని, ఆ బాధ వర్ణణాతీమని అన్నారు. ఇలాంటి సమయంలోనే గుండె దిటవు చేసుకోవాలని, మీసేవలు రాష్ట్రాలనికి చాలా అవసమరి అన్నారు. అనంతరం పలు అంశాలపై చర్చించి, కొద్దిసేపు అక్కడే వుండి అనంతరం విజయవాడ బయలు దేరారు.