సింహాచల పర్యాటకానికి రూ.53 కోట్లు మంజూరు..మంత్రి


Ens Balu
2
2020-07-29 19:03:27

దేవాలయ పర్యాటకం లో భాగంగా  సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి రూ.53 కోట్లు కేంద్ర నిధులు మంజూరైనట్లు ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ప్ర‌సాద్‌ (నేష‌న‌ల్ మిష‌న్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేష‌న్ అండ్ స్పిర్చువ‌ల్ అజ్‌మెంటేష‌న్ డ్రైవ్‌) పథకంలో  సింహాచ‌లం  దేవాల‌య అభివృద్దికి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ మొత్తాన్ని మంజూరు చేశారన్నారు.  ఈ నిధులతో ఆలయంలో పర్యాటక రంగ అభివృద్ధికి తగిన విధంగా ఖర్చు చేయడం జరుగుతుందన్నారు.   ఈ నిధుల కొరకు లేఖ రాసిన వెంటనే స్పందించి నిధులను విడుదల చేసిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి వారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
సిఫార్సు