కోవిడ్ కేర్ సెంటర్ లో నాణ్యమైన భోజన సదుపాయాలు..


Ens Balu
3
Visakhapatnam
2020-07-29 18:59:49

కోవిడ్ కేర్ సెంటర్లలో పేషంట్లకు  నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందజేస్తున్నట్లు  జాయింట్ కలెక్టర్ – ౩ గోవిందరావు తెలిపారు. బుధవారం నాడు   జాయింట్ కలెక్టరు , ఆర్ డి ఓ, పి.కిశోర్ తో  కలిసి మారికవలసలోని  గిరిజన  బాలికల కళాశాల భవనంలో   ఏర్పాటు చేసిన వంటశాలను  ఆకస్మికంగా  తనిఖీ చేసారు.  ప్రభుత్వ మానసిక వైద్యశాల అసోసియేట్ ప్రొఫెసర్ డా.నాగరాజు, డిప్యూటీ తాహశీల్దార్  రవి కుమార్,రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్, సీనియర్ అసిస్టెంట్ నరసింహ మూర్తి కోవిడ్ కేర్ సెంటర్ లోని రోగుల ఆరోగ్య పరిస్థితిని, భోజన , వసతి వివరాలను వారికి తెలియజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టరు  మాట్లాడుతూ విశాఖనగరంలో కోవిడ్ పరీక్షలు చేయించుకొని పాజిటివ్ వచ్చిన వ్యక్తులను ఈ కోవిడ్ కేర్ సెంటర్లలో   ఉంచి ,  24గంటలు  వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు.  మొత్తం 12 మంది డాక్టర్లు, 6 మంది నర్సులు, వున్నారని , మూడు  భవనాలలో ప్రతి షిప్టులోను 1 డాక్టరు, 1  నర్సు  ఉంటారని తెలిపారు.  ఎవరికైనా  అనారోగ్య పరిస్ధితి తలెత్తితే తక్షణమే  అంబులెన్స్ లో  కోవిడ్ ఆసుపత్రికి  తరలిస్తారని తెలిపారు.  జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భోజన , వసతి సౌకర్యాలను  పరిశీలించామని తెలిపారు. శ్రీ చైతన్య  కాలేజీ భవనాల లో మూడు బ్లాకులు ఉన్నాయని,  అందులో అబ్దుల్ కలామ్  భవనంలో ఇప్పటి వరకు 379 మంది ఎడ్మిట్ కాగా 164 మంది పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారని, 71 మంది హోం ఐసోలేషన్ లో వున్నారని, 9 మందిని  కోవిడ్ ఆసుపత్రికి రిఫర్ చేసామని తెలిపారు. ప్రస్తుతం 135 మంది మహిళా పేషెంట్లు ఉన్నారని ఈ భవనాన్ని ప్రత్యేకంగా మహిళల కోసం కేటాయించారని తెలిపారు.ఈ భవనంలో మొత్తం 390 బెడ్స్ ఉన్నాయని తెలిపారు.  భగీరద బ్లాక్ లో  180 రూమ్ లు , 500 బెడ్స్ ఉన్నాయని, ఇప్పటివరకు 293 మంది ఎడ్మిట్ కాగా, 13 మంది డిశ్చార్జి  అయ్యారని, 20 మంది హోం ఐసోలేషన్ లో వున్నారని, 8 మందిని కోవిడ్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు తెలిపారు.  ప్రస్తుతం 252 మంది పేషంట్లు ఉన్నారని తెలిపారు.   వాల్మీకి బ్లాక్ లో 160 రూమ్ లు,  480 బెడ్స్ ఉన్నాయని తెలిపారు.  ఇప్పటి వరకు 516 మంది ఎడ్మిట్ కాగా, ఒకరు డిశ్చార్జి  అయ్యారని, 241 మంది హోం ఐసోలేషన్ లో వున్నారని, 14 మందిని కోవిడ్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం  260 మంది  పేషంట్లు ఉన్నారని  అందులో  155 మంది పురుషులు, 105 మంది మహిళలు ఉన్నారని తెలిపారు.  వీరికి  ఉదయం 7గంటలకు రాగి జావ, పాలు ఇస్తున్నారని, ఉదయం 8.30 గంటలకు అల్పాహారంగా ఇడ్లీ, వడ , పూరి, చపాతి, టీ, కాఫీలు ఇస్తున్నారని తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజనంలో రోటి, రైస్, చికెన్ కర్రీ, వెజిటబుల్ కర్రీ, ఆకుకూర, పప్పు,  సాంబారు, పెరుగు, అరటిపండు ఇస్తున్నారని తెలిపారు. సాయంత్రం 4గంటలకు  టీ, కాఫీ ఇస్తున్నారని తెలిపారు.  రాత్రి 7.30 గంటలకు  భోజనంలో రోటి, రైస్, గుడ్డు, వెజిటెబుల్ కర్రీ, ఆకుకూర,  పప్పు, సాంబారు, పెరుగు, అరటి పండు ఇస్తున్నారని తెలిపారు.  
సిఫార్సు