ఆ ఎస్పీ దాత్రుత్వానికి సెల్యూట్..


Ens Balu
3
Tirupati
2020-11-26 15:43:26

ఆ ఎస్పీ దాత్రుత్వానికి నిజంగా సెల్యూట్ చేయాల్సిందే..నివర్ తుపాను విలయతాండవం చేస్తున్న తరుణంతో నా అనేవారు లేని అనాధల కోసమే ఆలోచించారు..డిఎస్పీకేడర్ అధికారిని వారికి సేవలు చేయమని పంపి వారి కడుపు నింపారు...ఆయన తిరుపతి అర్భన్ జిల్లా ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి. అనునిత్యం ప్రజలకు ఫ్రెండ్లీ పోలిసింగ్ ను దగ్గర చేసే ఈయన సేవ కార్యక్రమాల్లో అధికంగా పాల్గొంటారు. తుపానులో ముఖ్యమైన ప్రాంతాల పర్యటనకు వెళుతూ,మార్గ మధ్యలో దిగాలుగా కనిపించిన అనాధలను చూసి తక్షణమే తన సిబ్బందిని ఆదేశించారు. వెంటనే తిరుపతి పట్టణంలో నిరాశ్రయులుగా ఉన్న అనాధలను వెతికి వారికి ఆహారం, బట్టలు ఇవ్వాలని సూచించారు. దీంతో రంగంలోకి దిగిన డిఎస్పీ మురళీ క్రిష్ణ, సిఐ శివప్రసాదరెడ్డిలు నగరంలోని అనాధలను గుర్తించి వారికి ఆహార పొట్లాలు, బట్టలు పంపిణీ చేశారు. నివర్ తుఫానులో ప్రజలను కాపాడటానికే ఖాళీ లేకుండా వరద ప్రాంతాలను తిరుగుతూనే అనాధల కోసం ఆలోచించి మరీ వారికి ఆకలి తీర్చిన ఎస్సీ రమేష్ రెడ్డి సేవకు ప్రశంసల జల్లు కురుస్తోంది..ఐపీఎస్ లంటే విధి నిర్వహణే కాదు..మానవతా ద్రుక్పదం చాటడంలో ముందుంటారని ఈయనను చూస్తే ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది.!