ఘనంగా రాజ్యంగ దినోత్సవం..


Ens Balu
3
కలెక్టరేట్
2020-11-26 16:31:32

భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా గురువారం విశాఖ కలెక్టర్ రేట్ లో కలెక్టర్ వినయ్ చంద్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫొటో కు పూలమాలలు వేసి  ఘనంగా నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని భారత రాజ్యాంగం గూర్చి  సిబ్బంది అందరితో చదివి  వినిపించారు. నివాళులు అర్పించిన వారిలో కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్,   ఎ. ఓ. రామ్మోహన్, కలెక్టర్ కార్యాలయం అన్ని విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.