పేర్ని నాని కుటుంబాన్ని పరామర్శించిన భరత్ రామ్..
Ens Balu
3
Machilipatnam
2020-11-26 16:50:05
రాజమండ్రి ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ననాని తల్లిగారికి మచిలీపట్నంలో గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. పేర్నినానితో కొంతసేపు మాట్లాడారు. ఇలాంటి సమయంలోనే మనసు దిటవు చేసుకోవాలని పేర్నిని సముదాయించారు. తల్లిని కోల్పోవడమంటే ఇంటిపెద్దను కోల్పోవడమేనని, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని అన్నారు.అనంతరం పలు అంశాలు పేర్నితో చర్చించారు. గత మూడు రోజులు పేర్ని కుటుంబాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పరామర్శిస్తూనే వున్నారు.