షాహిదాబేగం హత్య కేసులో ఐదుగురు అరెస్టు..
Ens Balu
2
Kalyandurga
2020-11-26 17:29:01
అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామానికి చెందిన షాహిదా బేగం అలియాస్ షాహిదమ్మ (19) హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని కళ్యాణదుర్గం డీఎస్పీ ఎన్ రమ్య పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆమె బాధితులతో మాట్లాడుతూ, కనేకల్లు మండలం తుంబిగనూరు సమీపంలోని హెచ్చెల్సీ కాలువలో షాహిదా బేగం నిన్నటి రోజున శవమై తేలిన విషయమై ఈనెల 17 వ తేది రాత్రి నుంచి షాహిదాబేగం కన్పించుటలేదని కళ్యాణదుర్గం రూరల్ పోలీసు స్టేషన్లో ఆ అమ్మాయి తల్లి దూదేకుల సతాన్భీ ఈనెల 19 రాత్రి 7 గంటలకు ఫిర్యాదు చేశారన్నారు. వెంటనే మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ఈ హత్యతో సంబంధమున్న చాపిరి గ్రామానికి బి.రఘు, ఇతని చిన్నాన్నలు రాజప్ప అలియాస్ రాజశేఖర్ , ఆనంద్ , పిన్నమ్మ విశాలమ్మ, అమ్మ లింగమ్మలను అరెస్టు చేశామన్నారు. ఈ ఐదుగురిలో ప్రధాన నిందితుడైన బి.రఘు ఈనెల 17 న పెళ్లి చేసుకుంటానని షాహిదా బేగంను నమ్మించి కనేకల్లు మండలం మాల్యం వద్దకు తీసికెళ్లాడన్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని మాల్యం సమీపంలోని హెచ్చెల్సీ కాలువలోకి షాహిదా బేగంను తోసేశాడన్నారు. ఈ కేసును త్వరగా ఛేదించిన కళ్యాణదుర్గం రూరల్ సి.ఐ శివశంకర్ నాయక్ , ఎస్సై సుధాకర్ మరియు సిబ్బందిని కళ్యాణదుర్గం డీఎస్పీ అభినందించారు. చాపిరి షాహిదా బేగం హత్య కేసులో ప్రధాన నిందితుడైన బి.రఘుపై రౌడీషీట్ ఓపెన్ చేశామని డీఎస్పీ ఎన్ రమ్య తెలిపారు. అమ్మాయిలు/మహిళలపై నేరాలకు ఒడిగడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు.