గ్రామాల్లో సమస్యలను వెలికితీయాలి..


Ens Balu
3
నవోదయకాలని
2020-11-26 19:41:18

గ్రామసచివాలయ ఉద్యోగులు వారి వారిశాఖలకు అనుగుణంగా గ్రామాల్లోని సమస్యలను వెలికితీసి పరిష్కరించాలని జెసి నిషాంత్ కుమార్ ఆదేశించారు. గురువారం అనంతపురం అర్భన్ పరిధిలోని నవోదయ కాలనీ సచివాలయాన్ని ఆయన ఆకస్మింగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, ప్రజల సమస్యలు గ్రామస్థాయిలోనే పరిష్కారం అవుతాయనే భరోసాను సచివాలయ సిబ్బంది కల్పించాలన్నారు. వాలంటీర్లు రోజూ సచివాలయానికి రావాలన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అర్హుల జాబితాలను ఖచ్చితంగా నోటీసు బోర్డులో పెట్టాలన్నారు. వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంజనీరింగ్ అధికారులు శానిటేషన్, మంచినీటి సరఫరా, నిర్మాణాల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. మూమెంట్ రిజిస్టర్ తప్పనిగా మెయింటేన్ చేయాలని ఆదేశించారు.