దళారులను నమ్మి మోసపోకండి..


Ens Balu
2
Rajavommangi
2020-11-27 13:59:18

రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాల్లోని రైతులకు మద్దతు ధర కల్పించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి అన్నారు. శుక్రవారం రాజవొమ్మంగి మండలం జడ్డంగిలో రైతుభరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులు దళారుల భారిన పడకుండా ప్రభుత్వమే గిరిరైతుల నుంచి పండించిన ధాన్యమం మొత్తం కొనుగోలు చేస్తుందన్నారు. దళారులను నమ్మడం ద్వారా మోసాలు జరిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అలాంటివి జరగకుండా పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించిందన్నారు. రైతులు ఆ విషయాన్ని గుర్తించి ప్రకటించిన మద్దతు ధరతో ప్రభుత్వానికే ధాన్యం మొత్తం అందించాలన్నారు. కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, గ్రామసచివాలయ వ్యవసాయశాఖ సిబ్బంది, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు..