రాజమండ్రి జైలు నుంచి విడుదలైంది వీరే....


Ens Balu
9
Rajahmundry
2020-11-27 17:23:33

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 19 మంది మహిళా ఖైదీలు విడుదలయ్యారు. తమ జీవితాలు జైలుకే అంకితం అయిపోతాయనుకున్న వారందరికీ రాష్ట్రప్రభుత్వం క్షమాబిక్ష పెట్టడంతో ఐదేళ్ల జైలు జీవితానికి ముందే వారంతా విడుదలయ్యారు. జైలు గోడల నుంచి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టిన వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అందులో వయస్సు మళ్లిన వారు, వయస్సు మీద పడుతున్నవారు, వయస్సులో  వున్నవారు ఇలా చాలమందే ఉండటం విశేషం. శుక్రవారం జైలు నుంచి విడుదైలన వారి వివరాలు తెలుకుంటే... కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన కరణం పార్వతి, విజయనగరం జిల్లా గుర్ల మండలం చింతలపేటకు చెందిన దాసరి అప్పలకొండ, పిల్లి సత్యం, విశాఖ జిల్లా కోటపాడు మండలం కె.గులేపల్లికి చెందిన వంటకు దేముడమ్మ, విశాఖ జిల్లా హుకుంపేట మండలం అడ్డుమంద గ్రామానికి చెందిన బకురి లక్ష్మి, కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్నంకు చెందిన మత్తుల నాగమణి, విజయనగరం జిల్లా సాలూరు మండలం బాగువలస గ్రామానికి చెందిన కోట లక్ష్మి, ధారాబత్తుల లక్ష్మి, పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర మండలం నత్త రామేశ్వరం గ్రామానికి చెందిన చిత్తూరి గోవర్ధన, పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన కడలి సత్యవాణి, విశాఖ జిల్లా అచ్చుతాపురం మండలం నారాయణమ్మపేటకు చెందిన జగరాపు రాములమ్మ, జగరపు సత్యవతి, జగరపు వరహలమ్మ, జగరపు దేవుడమ్మ, రాజన వరహలమ్మ, పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన సీరా శైలజ, విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం మద్దిగరువు గ్రామానికి చెందిన లింగేరి రూపవతి, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరానికి చెందిన పెరుం  హైమావతి, విశాఖ జిల్లా కొత్త గొర్లెవానిపాలెంకు చెందిన కుడ్రపు రమణమ్మ విడుదలయ్యారు.