రఘురామ క్రిష్ణరాజు మీతీరు మార్చుకోవాల్సిందే...


Ens Balu
3
Visakhapatnam
2020-07-29 21:37:29

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దయతో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు పై గెలిచి అదే పార్టీ ని ప్రభుత్వాన్ని విమర్శించటం రఘు రామ కృష్ణ రాజు కు తగదని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు అన్నారు. బుధవారం ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో ఆయన మీడియా తో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని, వైస్సార్ పార్టీ గుర్తు పై ప్రజాస్వామ్య బద్దంగా గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టిన రఘు రామ కృష్ణ రాజు ఇప్పుడు కొంతమంది స్వార్ధ పూరిత రాజకీయ నాయకుల డైరెక్షన్ లో ప్రజాస్వామ్యా విలువలకు తీట్లు పొడుస్తూ పొంతన లేని మాటలతో పార్టీ ని , ప్రభుత్వాన్ని విమర్శించటం తగదని అన్నారు. ఎక్కడో ఢిల్లీ లో కూర్చొని ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను విమర్శిస్తూ పక్క రాష్ట్రలతో మన రాష్ట్రం ను పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని అన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన నాటినుంచి ఉన్న స్తానం నుండి ఉన్నత స్థానం కు తీసుకురావటానికి అహర్నిశలు పని చేస్తున్నారని ఇచ్చిన హామీల్లో 90% శాతం పైబడి నెరవేర్చటమే కాకుండా కరోన వంటి మహమ్మరిని ఎదుర్కోవడం లో అనేక రకాలుగా చర్యలు చేపట్టి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. అలాగే విశాఖ పరిపాలన రాజధాని విషయంలో కూడా మీ ఆరోపణలు సరైనవి కావని విశాఖ ను పరిపాలన రాజధాని చేయడానికి అన్నివిధాలా అర్హత ఉన్న నగరమని, అన్ని రవాణా మార్గాలు కనెక్టివిటీ , అర్హత గల నగరమని అలాగే రాష్ట్ర ప్రగతికి ఆర్థికంగా ఆదుకునే నగరం విశాఖ మాత్రమేనని ఆయన అన్నారు. కాబట్టి రఘు రామ కృష్ణ రాజు గారు మీరు ఒక పార్లమెంట్ సభ్యునిగా చేతనైతే సహకరించండి లేదంటే చెతులు కట్టుకుని కూర్చొండి తప్ప నోటికి వచ్చిన విధముగా మాట్లావద్దని ఈ సందర్భంగా తెలియజేసారు.