సమయపాలన పాటించకపోతే చర్యలు..


Ens Balu
11
Ranastalam
2020-11-27 20:18:10

శ్రీకాకుళం జిల్లాలోని కె.జి.బి.విలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమయపాలనను తప్పనిసరిగా పాటించాలని, సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని సమగ్ర శిక్ష పథక సంచాలకులు పైడి వెంకటరమణ హెచ్చరించారు. రణస్థలం మండలంలోని కె.జి.బి.విని శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కె.జి.బి.విలో జరిగిన నాడు - నేడు పనులను పరిశీలించిన ఆయన కె.జి.బి.విలో పనిచేస్తున్న సి.ఆర్.టిలు, ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. సమయపాలన పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కె.జి.బి.విలో పనిచేస్తున్న సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరువేయాలని ఆదేశించారు. కోవిడ్ నేపధ్యంలో విద్యార్ధులకు కోవిడ్ సోకకుండా ఉండేందుకు అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ మాస్కును ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఓ , సి.ఆర్.టిలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.