సింహాచల దేవస్థానాన్ని మరింతగా అభివృద్ధిచేస్తాం...


Ens Balu
2
2020-07-30 14:10:23

విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీ. వరాహ లక్ష్మి నృసింహ స్వామి వారిని గౌరవ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రివర్యులకు సాదర స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం, దేవాలయం పర్యాటకంలో భాగంగా కేంద్ర నిధులనుండి రాష్ట్ర టూరిజం శాఖ ద్వారా సింహాచలం శ్రీ.వరాహ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానానికి రూ.53.00 కోట్లు అభివృద్ధి పనులకు మంజూరు చేసినందుకు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహలాద్ సింగ్ పటేల్ గారికి, కేంద్ర మంత్రి గారికి, ముఖ్య మంత్రివర్యులు శ్రీ.వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి మరియు విజయ్ సాయి రెడ్డి గారికి విశాఖపట్నం ప్రజల తరుపున మంత్రి అవంతి శ్రీనివాస రావు గారు కృతఙ్ఞతలు తెలియజేశారు. అనంతరం, అభివృద్ధి పనులపై కేటాయించిన నిధులను ఏఏ సౌకర్యాలు కల్పించాలనే దానిపై సింహాచలం ఈ.ఓ గారితో, దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం వారితో మరియు టూరిజం శాఖ ఇంజనీరింగ్ విభాగం వారితో చర్చించారు..