ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి..


Ens Balu
2
నెల్లూరు
2020-11-27 20:37:12

నెల్లూరులో అధిక వర్షాలు, వరదల కారణంగా ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి పోలీసుల సహాయం తీసుకోవాలని నెల్లూరు ఎస్పీ భాస్కర్ భూషన్ కోరారు. శుక్రవారం రాత్రి నగరంలోని పాత చెక్ పోస్టు వద్ద గల అహ్మద్ నగర్ కాలనీ వాసులతో స్వయంగా మాట్లాడి సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. భారీ వర్షాలతో పాటు, సోమశిల జలాశయం నుంచి 5 లక్షల క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారన్నారు. దాని కారణంగా 10 అడుగులు పైకి నీరు వచ్చే అవకాశం వుందని..లోతట్టు ప్రాంతాలు ముంపు ప్రాంతాలైన భగత్ సింగ్ కాలనీ, దర్గా వీధి, లక్ష్మీ స్ట్రీట్ తదితర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కోరారు. ప్రజలు అత్యవసర సమయాల్లో 100, 9390777727 కి కాల్ చేయాలని సూచించారు.