రూ.60లక్షలతో హరితవనం అభివ్రుద్ధి..
Ens Balu
3
ఎంవీపికాలనీ
2020-11-27 20:43:07
విశాఖలోని ఎం.వి.పి. కోలనీ సెక్టార్-1లో హరితవనం పార్కును రూ.60.00 లక్షల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్టు జివిఎంసి కమీషనర్ డా.జి.స్రిజన చెప్పారు. శుక్రవారం ఈ మేరకు జోన్2 పరిధిలోని అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు, స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ సభ్యులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, సంబందిత పార్కు అభివృద్ధి స్థలంలో పెండింగ్ లో ఉన్న కోర్టు వాజ్యాన్ని త్వరితగతిన పరిష్కారం అయ్యేటట్లు తగు చర్యలు చేపట్టాలని జోన్-2 పట్టన ప్రణాళిక విభాగపు అధికారులను ఆదేశించారు. తదనంతరం ఎం.వి.పి. కోలనీ 7వ వార్డులో గల హెడెన్ స్పౌట్స్ దివ్యాంగుల పాఠశాల భవన స్థలం అభివృద్ధి పరచడానికి సంస్థ పెట్టిన ప్రతిపాదనలను పరిశీలించారు. ఈపనులన్నీ సత్వరమే పూర్తిచేయడం ద్వారా పార్కు పనులను ఈ ప్రాంతంలో ప్రారంభించడానికి అవకాశం వుంటుందన్నారు. ఈ క్షేత్రపర్యటనలో అసిస్టెంట్ డైరెక్టర్(హార్టికల్చర్) ఎం. దామోదరరావు, పర్యవేక్షక ఇంజినీరు రాజారావు, కార్యనిర్వాహక ఇంజినీరు మెహెర్ బాబా, జోన్-2 పట్టణ ప్రణాళిక అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.