వారందరికీ చార్జ్ మెమోలు ఇవ్వండి..
Ens Balu
3
Visakhapatnam
2020-11-27 20:54:23
ఏడాది దాటినా వీరి పనితీరులో మార్పు రావడం లేదు..ఏం చేస్తారులే అన్నట్టు వ్యవహరిస్తున్నారు..విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారందరికీ చార్జి మెమోలు ఇవ్వండి అంటూ జివిఎంసీ కమిషనర్ డా.స్రిజన వార్డు సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శక్రవారం అనంతరం, 70 వ వార్డులోని ఎస్.ఎల్.ఎన్. నగర్లో ఉన్న నాలుగు సచివాలయాలను సందర్శించి వార్డు కార్యకర్తల పనితీరును రికార్డులను, వారి రిజిస్టరులను తనిఖీ చేసారు. వార్డు కార్యదర్శులు సరిగా పనిచేయడం లేదని, రికార్డులు సరిగా రాయడం లేదని, కార్యదర్శులపై మరియు వార్డు ప్రత్యేక అధికారి, రెవెన్యూ ఆఫీసరు సురేష్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పధకాలకు సంబందించిన పోస్టర్లు, సూచికలు సరిగా లేనందున వార్డు ప్రత్యేక అధికారులతో పాటు, వార్డు కార్యదర్సులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చార్జ్ మెమోలు ఇవ్వాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. ఇక ముందు, ఇటువంటివి పునరావృతం అయితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతకు ముందు గోపాలపట్నం ఆర్చ్ వరకు రోడ్లను పరిశీలించి 2కోట్ల 60లక్షలు రూపాయల అంచనా వ్యయంతో బి.టి. రెన్యూవల్ పనులకు ఆమోదం తెలిపారు. సుజాత నగర్ 80 అడుగుల రహదారి మరియు కిషోర్ లే అవుట్ రహదారి వెడల్పు పనులకు సంబందించి ఆర్.డి.పి.ని తయారు చేయాలని అసిస్టెంట్ టౌన్ ప్లాన్నింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో జోనల్ కమిషనర్ రమణ, పర్యవేక్షక ఇంజినీరు శివ ప్రసాదరాజు, ఏ.సి.పి. భాస్కర బాబు, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు వీరయ్య, వార్డు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.