బడుగుల గొంతుక జ్యోతీరావు ఫూలే..


Ens Balu
3
Anantapur
2020-11-28 13:08:39

బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కులు, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడని రాష్ట్ర రహదారుల మరియు భవనాల శాఖా మాత్యులు మంత్రి మాలగుండ్ల శంకర నారయణ అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే 130 వ వర్థంతి సందర్భంగా పెనుకొండ లోని మంత్రివర్యుల క్యాంప్ కార్యాలయంలో ఆయన మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జోతిబా పూలే అని కూడా పిలువబడే జ్యోతిరావు గోవిందరావు పూలే ఒక భారతీయ సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త అని మంత్రి కొనియాడారు.ఆయన కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకు గురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడన్నారు. అంతేకాకుండా భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడన్నారు.ఆయన చూపిన బాటలో మనమంతా నడచినప్పుడే ఆయనకు మనం నిజమైన నివాళులు అర్పించినట్లవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.