ఏయూ విసికి SCRWA ఘన సత్కారం..


Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2020-11-28 14:27:07

ఆంధ్రా యూనివర్సిటీకి పూర్తిస్థాయి వైస్ ఛాన్సలర్ గా నియమితులైన ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి ని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రాయూనివర్శిటీ విసి చాంబర్ లో అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ యూనియన్ సభ్యులు వెళ్లి పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా ఏయూలోనే చదివి, ఏయూలోనే ఆచార్యునిగాపనిచేసి నేడు అదే ఏయూకి ఉప కులపతిగా నియమితులవడం శుభపరిణామం అన్నారు. ఎంతో మంది విసిలు ఇక్కడ పనిచేసినా ఇంతటి గౌరవం ఎవరికీ దక్కలేదన్నారు. ఆసియాకే తలమానికంగా వున్న ఏయూ మీ హయాంలో మరింత అభివ్రుద్ధి సాధింస్తుందని ఆశోక్ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.