జివిఎంసీ కమిషనర్ కు SCRWA ఘన సత్కారం..
Ens Balu
3
జివిఎంసీ కార్యాలయం
2020-11-28 15:32:57
మహా విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ డా.స్రిజన క్రుషి, అధికారులతో చేసిన టీమ్ వర్క్ ఫలితంగానే విశాఖకు స్వచ్ఛ సర్వేక్షణ్ లో మంచి ర్యాంకు సాధ్యపడిందని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫే అసోసియేషన్ అధ్యక్షుడు బంగారు అశోక్ కుమార్ అన్నారు. శనివారం విశాఖలో కమిషనర్ ను స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు అశోక్ కుమార్ మాట్లాడుతూ, ఎంతో మంచి విజన్ వున్న ఐఏఎస్ అధికారిని డి.స్రిజిన అని కొనియాడారు. ఆమె ముందుచూపు, చేసిన అభివ్రద్ధి వలనే జివిఎంసికి మంచి పేరు వస్తుందన్నారు. ఇటీవల బీచ్ రోడ్డులోని నిర్మించిన అందుల పార్కుతో అంతర్జాతీయ ఖ్యాతి కూడా వచ్చిందని కొనియాడారు. విశాఖను స్వచ్చవిశాఖగా చేయడంలోనూ, చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దడంలోనూ కమిషనర్ విశేషంగా క్రుషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ స్పందిస్తూ, ప్రభుత్వం తరపున చేసే కార్యక్రమాలు మీడియా సహాయం ఎంతగానో అందిస్తున్నారని, ఇదే ఉత్సాహాన్ని, సహకారాన్ని రానున్న రోజుల్లోనూ అదించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.