బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతీ ఫూలే..


Ens Balu
2
Visakhapatnam
2020-11-28 16:10:35

బడుగు, బలహీనవర్గాల వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించిన ఆశా జ్యోతి, వారి హక్కులు, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు మహాజ్యోతీరావు ఫూలే అని ఏపీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పోలాకి శ్రీనివాసరావు అన్నారు. శనివారం మహాత్మ జ్యోతిరావు పూలే 130 వ వర్థంతి సందర్భంగా ఏపిఈడిసిఎల్ కార్యాలయ ఆవరణలోని ఫూలే విగ్రహానికి ఆయన  పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈసందర్భంగా పోలాకీ మాట్లాడుతూ, జోతిబా పూలే అని కూడా పిలువబడే జ్యోతిరావు గోవిందరావు పూలే ఒక భారతీయ సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త అని  కొనియాడారు. ఆయన కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకు గురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు  వారి హక్కుల కోసం పోరాడిన మహా నేత అని అన్నారు. అలాంటి వ్యక్తిని ప్రతీఏటా ఖచ్చితంగా మననం చేసుకోవాలన్నారు. అంతేకాకుండా భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని కీర్తించారు. ఆయన చూపిన బాటలో మనమంతా నడచినప్పుడే ఆయనకు  నిజమైన నివాళులు అర్పించినట్లవుతుందని పోలాకి శ్రీనివాసరావు  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.